కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడిని ఖండిస్తున్నాం: వనమా
కొత్తగూడెంలొ బిఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం
పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలు
కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 13: హైదరాబాదులో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం బిఆర్ఎస్ కార్యాలయంలొ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డిఇంటి పై దాడికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని, ఇలాంటి దాడులు పునరావృతం అయితే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ఆందోళనకు సిద్ధమవుతుందని అన్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ జడ్పీ చైర్ పర్సన్ కాపు సీతామాలక్ష్మి, టీబీజీకేస్ కేంద్ర సభ్యులు కూసాని వీరభద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, వైస్ ఎంపీపీ భూక్యా సోనా, లక్ష్మీ పల్లి మండల అధ్యక్షులు కోటి వెంకటేశ్వర్లు, అన్వర్ పాషా, బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List