ఢిల్లీకి సీఎం కేసీఆర్

On

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్‌లో తెలంగాణ హైకోర్ట్ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్.. ఆ వెంటనే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బంజారాహిల్స్‌లోని చీఫ్ జస్టిస్ నివాసంలో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే, చీఫ్ జస్టిస్‌తో ఏ అంశంపై సీఎం చర్చించారు. ఢిల్లీకి సడెన్‌గా ఎందుకు వెళ్లారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తెలంగాణ ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. […]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్‌లో తెలంగాణ హైకోర్ట్ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్.. ఆ వెంటనే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బంజారాహిల్స్‌లోని చీఫ్ జస్టిస్ నివాసంలో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే, చీఫ్ జస్టిస్‌తో ఏ అంశంపై సీఎం చర్చించారు. ఢిల్లీకి సడెన్‌గా ఎందుకు వెళ్లారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు తెలంగాణ ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితమివ్వనున్నారు. ప్రధాని రాకను నిరసిస్తూ లెఫ్ట్‌ పార్టీలు ఆందోళనకు పిలుపునివ్వడంతో రాజకీయ దుమారం చెలరేగుతోంది.

మరో వైపు ప్రధాని పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో అనేక చోట్ల మోదీకి నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. మరో వైపు మోదీ పర్యటనను అడ్డుకుంటామని, ఆందోళన చేపడతామంటూ వాపమక్షాలు, విద్యార్థి JAC నేతలు హెచ్చరించారు. అలాగే రామగుండం బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. ఇక ఇటు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కేంద్రం ప్రోటోకాల్‌ పాటించకుండా తెలంగాణ సీఎంను అవమానిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ కూడా కేంద్రం ఇలాగే వ్యవహరించిందని విమర్శించింది. ఇంతగా అవమానిస్తుంటే సీఎం ఎలా వస్తారని టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది.

ప్రధాని పర్యటనను వ్యతిరేకించడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని బీజేపీ నేతలు విమర్శించారు. ఏదేమైనా మునుగోడు ఎన్నికల తర్వాత మోదీ పర్యటన పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..